హనుమకొండ మెగా హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య

లష్కర్ సింగారం లోని UPHC లో స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్‌ లో భాగంగా మెగా హెల్త్ క్యాంప్ ను వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య  హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..... మహిళల ఆరోగ్య పరిరక్షణకు స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం ఎంతో దోహదపడుతుందని ఎంపీ డా.కడియం కావ్య అన్నారు. ఈ నెల 17 నుంచి అక్టోబరు 2 వరకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తారని చెప్పారు. మహిళలకు వివిధ రకాల స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించి, అవసరమైన వారికి తగిన వైద్య సేవలను అందించాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులను ఎంపీ డా.కడియం కావ్య ఆదేశించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం టి.బి పేషంట్లకు ఎంపీ న్యూట్రిషన్ కిట్ల ను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ అప్పయ్య, ఇతర వైద్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post