జూలై 1వ తేది నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకు జరుగనున్న జనసురక్షా ప్రచార కార్యక్రమం భారత ప్రభుత్వం సూచనల మేరకు

 జయశంకర్ భూపాలపల్లి జిల్లా, కాటారం మండలంలోని అంకుషాపూర్ గ్రామంలో ఆర్థిక సంక్షేమ పథకాలపై సమగ్ర శిబిరం నిర్వహించబడినట్లు ఎల్డిఎం తిరుపతి తెలిపారు.
మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా – కాటారం శాఖ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగహన కార్యక్రమంలో ఎల్డిఎం పాల్గొన్నారు. 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ప్రధానంగా ప్రధానమంత్రి జనధన్ యోజన (PMJDY), ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన (PMSBY), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), అటల్ పెన్షన్ యోజన (APY), అలాగే KYC పునరిద్దరణ నూతన నమోదులు మరియు పునర్నవీకరణలను చేపట్టినట్లు తెలిపారు.
ఈ ప్రచార కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి లబ్దిదారుడికి ఈ ప్రధాన ఆర్థిక సామాజిక భద్రతా పథకాల పరిధిని 100% పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యంగా కొనసాగించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాటారం ఎస్బిఐ బ్రాంచ్ మేనేజర్,
అంకుషాపూర్ గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post