మహిళా అభ్యున్నతికి ఎంతో కృషి చేసిన సావిత్రిబాయి పూలే

మహిళా అభ్యున్నతికి సావిత్రి బాయి పూలే చేసిన సేవలు మరువలేనివవి కాంగ్రెస్ శాయంపేటమండల పార్టీ అధ్యక్షుడు దూదిపాల బుచ్చి రెడ్డి అన్నారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డి మాట్లాడుతూ... దేశంలోనే మొదటి ఉపాధ్యాయురాలైన సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త అని, మహిళల విద్య కోసం ఎంతో కృషి చేశారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో పరకాల ఏఎంసి వైస్ చైర్మన్ మారపల్లి రవీందర్, మండల నాయకులు చిందం రవి, మారపల్లి రాజేందర్, వరదరాజు, రఫీ, ప్రపంచ రెడ్డి, వీరన్న, వలపదాస్ రాము, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు._

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post