శాయంపేట మండల పరిధిలోని కొప్పుల చలివాగు ప్రాజెక్ట్ .శివారులో అగ్నిప్రమాదం చోటుచేసుకుని రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. గ్రామానికి చెందిన.గండి హనుమంతు, తండ్రి వీరయ్యకు చెందిన సర్వే నెంబర్లు 597, 597/Aలో ఉన్న 3 ఎకరాల 12 గుంటల సాగుభూమిలో వరి సాగు చేసి సుమారు 100 బస్తాల చిల్లర పంట పండించారు.
పండించిన పంటను ఐకేపీకి తరలించేందుకు ట్రాక్టర్ తీసుకురావడానికి గ్రామానికి వెళ్లిన సమయంలో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో వరి పంటతో పాటు బస్తాలు, నీళ్ల పైపులు, పరదాలు మరియు ఇతర వ్యవసాయ సామగ్రి పూర్తిగా కాలిబూడిదయ్యాయి.
ఈ ఘటనతో రైతు .గండి హనుమంతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన నష్టపరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నా
Post a Comment