నేడు మెగా వైద్య శిబిరం శాయంపేట

BLN తెలుగు దినపత్రిక శాయంపేట, మార్చి 12:
శాయంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (PHC)లో నేడు మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మెడికల్ ఆఫీసర్ తెలిపారు. ఈ శిబిరంలో వివిధ విభాగాలకు చెందిన నిపుణ వైద్యులు పాల్గొని ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించనున్నారు.
ఈ ప్రత్యేక వైద్య శిబిరంలో స్త్రీల ఆరోగ్య సమస్యలకు సంబంధించి ప్రసూతి మరియు గైనకాలజీ వైద్యురాలు (OBG), పిల్లల వ్యాధులకు పిల్లల వైద్యుడు (Paediatrician), ఎముకల సమస్యలకు ఆర్థోపెడిక్ వైద్యుడు (Orthopedic), కంటి సమస్యలకు ఆప్తమాలజిస్ట్ (Ophthalmologist), సాధారణ ఆరోగ్య సమస్యలకు జనరల్ ఫిజీషియన్, దంత సమస్యలకు డెంటిస్ట్ (Dentist) సేవలు అందుబాటులో ఉండనున్నాయి.
అలాగే గర్భిణీలు (ANC) మరియు బాలింతలు (PNC) కూడా ఈ శిబిరానికి వచ్చి వైద్య సేవలు పొందాలని అధికారులు సూచించారు. ఆశా వర్కర్లు మరియు ఏఎన్‌ఎమ్‌లు తమ పరిధిలో ఉన్న ప్రజలకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఉదయం 9:30 గంటలలోపు పిహెచ్‌సీకి పంపించాలని కోరారు.
ఈ మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించేందుకు స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరుకానున్నారు. శాయంపేట మండల ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఉచిత వైద్య సేవలు పొందాలని మెడికల్ ఆఫీసర్ సూచించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post