హనుమకొండ జిల్లా, శాయంపేట మండలం, పెద్దకోడేపాక గ్రామంలోని శివాలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని భక్తులు ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం తెల్లవారుజామునందే శివాలయానికి చేరుకుని అర్చనలు, అభిషేకాలు చేస్తూ భక్తి సమ్మరం చేశారు.స్థానిక ఎస్సై పరమేశ్వర్ ఆలయంలో కూడా ప్రత్యేక పూజలు ఆధ్వర్యంగా జరిగాయి. ఆలయంలోని జలజ్యోతి లింగం ప్రత్యేకత కలిగినదని పూజారి తెలిపారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఈ ఆలయానికి విశిష్ట స్థానం ఉంది.ఈ కార్యక్రమంలో ఎస్సై పరమేశ్, మందవీనా ప్రభాకర్, స్నేహితులు సునీత చంద్రమొగిలి, రేణికుంట్ల తిరుపతి, కొతవల కిరణ్, తుడుంకుమారస్వామి, గుడి అయ్యగారు, ఉత్సవ కమిటీ పల్లెబోయిన శ్రీను, చైర్మన్ కత్వాల కిరణ్కుమార్, కార్యదర్శి రాజేందర్ తదితర భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment