ఉమ్మడి వరంగల్ జిల్లాకు గొప్ప చరిత్ర ఉంది. ప్రపంచంలోనే భారతదేశానికి గొప్ప పేరు తెచ్చిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఈ ప్రాంతానికి చెందినవాడు. తొలి, మలి తెలంగాణ ఉద్యమంలో కాకతీయ, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాడారు. తెలంగాణ ఉద్యమంలో కార్త, క్రియగా కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు వ్యవహరించారు. తెలంగాణను సాధించడంలో ముందుభాగంలో నిలబడిన ప్రొఫెసర్ జయశంకర్ ఈ ప్రాంతపు బిడ్డ. నల్ల బంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులు ఈ దేశానికే ఆదర్శంగా నిలిచారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది సింగరేణి కార్మికులు పిడికిలి బిగించి పాల్గొన్నారు.భూపాలపల్లి జిల్లా రద్దు రాయితీఎన్టీఆర్ మొదట భూపాలపల్లిని మండల కేంద్రంగా మార్చి, బొగ్గు వెలికితీతకు పునాది రాయి వేశారు. భూపాలపల్లి జిల్లాను రద్దు చేస్తారని తప్పుడు విష ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ జిల్లాను తొలగించడం కాని, కొత్త జిల్లాను ఏర్పాటు చేయడం కాని ప్రభుత్వ పరిశీలనలో లేవు. జిల్లా పునర్విభజనపై అందరి అభిప్రాయాలు తీసుకుని, అసెంబ్లీలో చర్చ చేసిన తర్వాత ఆలోచిస్తాం. కుట్రలు, కుతంత్రాలతో విష ప్రచారాలు చేస్తున్నవారిని గమనించాలి. భూపాలపల్లి జిల్లా ఎక్కడికి పోదు. తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం తప్పుడు ప్రచారం చేస్తున్నారు.సింగరేణి కార్మికులకు న్యాయంసింగరేణి కార్మికులకు సంబంధించిన మెడికల్ అన్ఫిట్ బోర్డును రద్దు చేస్తాం. సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై కొందరు విష ప్రచారం చేస్తున్నారు. మెడికల్ బోర్డుపై విష ప్రచారం చేసే వారిని మోకాళ్లపై కూర్చొబెట్టాలి. సింగరేణి కార్మికులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. సింగరేణి కార్మికులు నిండు మనసుతో పనిచేయడం వల్లనే రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వం సింగరేణి కార్మికులది... వారికి నష్టం కలిగించే పనిచేయం. 217 డిస్మిస్ కార్మికుల సమస్యలు తప్పకుండా పరిష్కరిస్తాం.ఇందిరమ్మ ఇళ్లు: పేదల ఆత్మగౌరవంవైఎస్ హయాంలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మించారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని గత పాలకులు మాయ మాటలు చెప్పారు. గత పాలకులు వెయ్యి ఎకరాల్లో ఎర్రవల్లిలో, ఫామ్హౌస్ 100 ఎకరాల్లో జన్వాడలో కేటీఆర్, హరీష్ రావు, కవిత, సంతోష్ రావులు ఫామ్హౌస్లు కట్టుకున్నారు. ఒక్క కేసీఆర్ క్లాస్మెంట్ జాహంగీర్కు మాత్రమే ఇప్పటి వరకు ఏమీ రాలేదు. టీవీలు, పేపర్లు, వేల కోట్ల రూపాయల వ్యాపారాలు కేసీఆర్ కుటుంబానికి వచ్చాయి. కానీ పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు రాలేదు. ఏడాదికి 2 లక్షల ఇళ్లు కట్టి పదేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టే అవకాశం కేసీఆర్కు ఉండేది. కానీ పేదల ఆత్మగౌరవాన్ని పట్టించుకోలేదు. పేదలపై ఆయనకు ప్రేమ లేదు. భూపాలపల్లిలో రైతు పోరాట బాట, కార్మికుల పోరు బాట నేను గతంలో నిర్వహించాను. ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. 22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. వచ్చే బడ్జెట్లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. పేదల ఆత్మగౌరవం పెరిగేలా, ఆడబిడ్డలు ఆశ్వాస్తి పొందేలా ఇందిరమ్మ ఇళ్లు రెండో విడత మంజూరు చేస్తాం.ఆధ్యాత్మిక, అభివృద్ధి కార్యక్రమాలుసరస్వతి పుష్కరాలు అద్భుతంగా నిర్వహించుకున్నాం. 1000 ఏళ్లు గుర్తుండేలా మేడారం ఆలయం నిర్మించాం. సమ్మక్క సారలమ్మ జాతరను అద్భుతంగా నిర్వహించాం. జంపన్న వాగు నుంచి రామప్ప చెరువుకు నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కొండా సురేఖ, సీతక్క మేడారం జాతరను అద్భుతంగా నిర్వహించారు. 2027లో రాబోయే గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు పర్యాటక ప్రాంతంగా 3-4 వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తాం. గోదావరి పరిరాహక ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. ప్రజా ప్రభుత్వానికి మీ ఆశీర్వాదం ఉండాలి... అప్పుడే మీ సమస్యలు పరిష్కారం అవుతాయి.మున్సిపాలిటీలకు నిధులు, ఇతర విషయాలుపదేళ్లు సీఎంగా ఉండి భూపాలపల్లికి బైపాస్ రోడ్డు తీసుకురాలేదు. మాయ మాటలు చెప్పే వాళ్లకు ఓటు వేస్తే మోసపోతారు, జాగ్రత్త. తెలంగాణలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు 17,442 కోట్లు మంజూరు చేశాం. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలకు 6,116 కోట్లు మంజూరు చేశాం. భూపాలపల్లి మున్సిపాలిటీకి 92 కోట్ల నిధులు మంజూరు చేశాం. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న గత పాలకుని తీరు తిక్కలోడు తిరునాళ్లకు పోయినట్లుంది. గత పాలకులు ఇంటిల్లిపాలికి పదవులు ఇచ్చుకున్నారు, కానీ పేదలకు ఏమీ చేయలేదు.ఎవరకైనా వారు తమ సామాజిక వర్గం పేరుతో నన్ను పిల్చుకున్నారు. ఎవరు ఎలా పిలిచినా సంతోషిస్తా. వేలకోట్ల ఆస్తులను పేదలకు దానం చేసిన గాంధీ కుటుంబంపై ఈడీ, సీబీఐని ఉపయోగిస్తున్నప్పుడు కాళేశ్వరం పై సీబీఐ విచారణకు పంపిస్తే ఎవరు అడ్డుకుంటున్నారు? ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్ను కాపాడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్తో ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్టులు, జడ్జిలు, సినీతారలను వదలలేదు. భార్యాభర్తలు ఫోన్లు విన్న పాపాత్ముడు ఎవరైనా ఉంటారా? వ్యాపారులను బ్లాక్మెయిల్ చేశారు. వ్యాపారుల ఫోన్లు ట్యాప్ చేసి వారి మాటలు విని ఆస్తులు రాయించుకున్నారు. టెలిఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్మెయిల్ చేసి వందల కోట్లు దోచుకున్నారు.భూపాలపల్లి మున్సిపాలిటీలో ప్రజల ఆశీర్వాదం ఉండాలి. ఇందిరమ్మ చీర్ల్లో మా అక్కలు దసర పండుగ రోజు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు. ఇందిరమ్మ చీర్ను సారె రూపంలో మీ తమ్ముడు పెట్టాడు. ప్రతి ఏడాది ఇందిరమ్మ చీర్ను సారెగా తప్పకుండా ఇస్తాం. ఆడబిడ్డల ఆశ్వాస్తి ప్రజా ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలి.అనంతరం మహిళా సంఘాలకు 205 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ అందజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు: రాష్ట్ర ఐటి పరిశ్రమలు శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ, సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పార్లమెంటు సభ్యులు డా. కడియం కావ్య, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్ రెడ్డి, 20 సూత్రాల అమలు చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, సింగరేణి కార్మిక సంఘ చైర్మన్, గ్రంథాలయ సంస్థ చైర్మన్లు రాజబాబు, రెహ్మాన్ తదితరులు.
గణపురం మండలం, చెల్పూర్ గ్రామ పంచాయతీలో 'ప్రజాపాలన... ప్రగతి బాట' బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment