వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు నాలుగు రోజులపాటు మేడారం జాతర జరగనుంది. ఈ జాతరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శీతాకాల విడిది కోసం ముర్ము ప్రస్తుతం హైదరాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఉన్న విషయం తెలిసిందే. ఇవాళ మంత్రులు కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్డ్డి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కలిసి జాతరకు ఆహ్వానించనున్నారు. మరోవైపు మేడారం గద్దెల పనులు చకచకా జరుగుతున్నాయి.
మేడారం జాతరకు రాష్ట్రపతికి ఆహ్వానం
byBLN TELUGU NEWS
-
0
Post a Comment