అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం..!ఆనాడు కాంగ్రెస్ గ్యారెంటీ కార్డు ఇచ్చింది..!ఈ రోజు మీరు కాంగ్రెస్ బాకీ కార్డు ఇవ్వండి..!బాకీ చెల్లించు ఓటు అడుగు...!
కేసీఆర్ అప్పులు రాష్ట్రంలో కనిపిస్తున్నాయి...
మీరు చేసిన అప్పులు మీ అర్బటాలల్లో కనిపిస్తున్నాయి...ప్రజలు చైతన్యవంతులై అన్ని గమనిస్తున్నారు..ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన మేము ఎప్పుడు అండగా ఉంటాం...
శాయంపేట మండల కేంద్రంలో,బీసీ కాలనీలో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుంది అంటూ 22 నెలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఒక్కవ్యక్తికీ పడ్డ బాకీని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేయండి అంటూ వచ్చే కాంగ్రెస్ నాయకుల నుండి వసూల్ చేయాలంటూ భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డుప్రజలకు ఇస్తూ, వివరిస్తూ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మాట్లాడుతూ....సకాలంలో ఎరువులు అందించి,పండిన పంటను రైతు కొనుగోలు కేంద్రాలు పెట్టి వడ్ల కొనుగోలు చేయడం జరిగింది.కానీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చి కేసీఆర్ పరిపాలన కంటే మేము అద్భుతంగా చేస్తామని మాకు అవకాశం ఇవ్వండి అంటూ ప్రజలల్లోకి వెళ్ళి ఆరు గ్యారెంటీలు 420 హామీల కార్డు ఇచ్చి ప్రజలను అత్యాశకు గురి చేసి ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రావడం జరిగింది.100 రోజులో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి 22 నెలలు గడుస్తున్నా గ్యారెంటీలు అమలు చేయలేదు.రైతులకి ఇస్తామని చెప్పిన రైతుబంధు ఇవ్వలేదు, రైతు ఋణమాఫీ చేయలేదు పైగా రైతు రాజు చేస్తామని చెప్పి రైతులను రోడ్డు మీద నిలబెట్టారు.మహిళలకు ఇస్తామన్నా రూ. 2500/- ఇవ్వలేదు, వృద్దులకు, వితంతువులకి, వికలాంగులకి పెన్షన్స్ పెంచనులేదు, కళ్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కేసీఆర్ ఇస్తే తులం బంగారం ఇస్తామని ఆశ పెట్టిండు.
కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి మాటలకు,ఆశపడ్డ మా మహిళా సోదరీమణులు బోల్తాపడ్డారు.
తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేశారు అన్నారు ఒక్కసారి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారి పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి చూస్తే కనిపిస్తుంది కేసీఆర్ చేసిన అప్పులు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 22 నెలల్లో చేసిన అప్పుల లెక్కలు కనిపిస్తున్నాయి కానీ రాష్ట్రంలో మాత్రం అభివృద్ధి సున్నా.
ప్రజలు చైతన్యవంతులైన్నారు, అని గమనిస్తున్నారని అన్నారు.రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేయ్యండి అంటూ వచ్చే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇదిగో మా బాకీ కార్డు, మాకు రావాల్సిన బాకీ ఇవ్వండి అంటూ అడగాలని ఈ సందర్భంగా కోరారు.వారి వెంట శాయంపేట మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment