పరకాల గడ్డ చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతం,అమరుల త్యాగం మరువలేనిది
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పరకాల పట్టణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకొని ఎమ్మెల్యే రేవురి ప్రకాష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై క్యాంపు కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేశారుఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ఎందరో మహనీయుల త్యాగఫలం.. రాచరికపు పాలన నుంచి విముక్తి పొంది భారత యూనియన్లో విలీనమైనతెలంగాణ..సెప్టెంబర్ 17 శుభదినం రోజున జరుపుకుంటున్న “ప్రజా పాలన దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు.అప్పటి ప్రధానమంత్రి శ్రీ. జవహార్ లాల్ నెహ్రూ నేతృత్వంలో అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ అధ్యక్షతన నిజాం పాలనపై, రజాకర్ల దురాగతాలపై సైనిక చర్యగా జరిపి, యుద్ధంలో నిజాం ను ఓడించి తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించారని అన్నారు.పరకాల గడ్డ చారిత్రక ప్రాధాన్యత గల ప్రాంతం,అమరుల త్యాగం మరువలేనిది అని,పరకాల అమరుల చరిత్ర ద్వారా భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది అన్నారు.అదేవిధంగా పోరాడి తెచ్చుకున్న తెలంగాణ లో తెలంగాణ ప్రజలు నయా నిజాం (కేసీఆర్) నిరంకుశ పాలనను అంతమెందించి, ప్రజా పాలన తీసుకువచ్చిన సందర్భంగా ప్రజా పాలన దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నట్లు తెలిపారు.రైతులు,మహిళలు,యువకుల సంక్షేమమే ధ్యేయంగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంది అన్నారు.కాంగ్రెస్ ప్రజా పాలనలో పేదలకు సన్నబియ్యం, ఉచిత కరెంటు, మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇండ్లు, మహిళలకు పెట్రోల్ బంకులు, క్యాంటీన్లు, బస్సులు, సోలార్ పవర్ ప్లాంట్ లు, వడ్డీ లేని రుణాలు, అర్హులైన అందరికీ రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు*
*ఈ కార్యక్రమంలోఆర్డీవో నారాయణ తాసిల్దార్ విజయలక్ష్మి సిఐ క్రాంతి కుమార్ ఏం సి చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ఇంకమేశ్వర్ టెంపుల్ చైర్మన్ కొలుగూరి రాజేశ్వరరావు రూరల్ మండల్ పార్టీ అధ్యక్షులు కటుకూరి దేవేందర్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ సుధా అనిత రామకృష్ణ ఎక్స్ ఎంపీపీ స్వర్ణలత సమన్వయ కమిటీ సభ్యులు మంద రామచందర్ చిన్నాల గునాథ్ పంచగిరి జయమ్మ చందుపట్ల రాఘవరెడ్డి ఎర్రబెల్లి భాస్కర్ రెడ్డి పబ్బ శ్రీనివాస్ దుబాసి వెంకటస్వామి ఒంటేరు సారయ్య ఏకు రాజు నల్లల అనిల్ సదానందం గౌడ్ ఎక్స్ ఎంపిటిసి రవి ఎక్స్ సర్పంచి రమేష్ ఎండి బాబా శివదల బాలరాజు ఎండి అలీ ఆజి శ్రీకాంత్ రమేష్ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు.
Post a Comment