హైదరాబాద్ శివారులోని కొంపల్లిలో వెలుగుచూస్తున్న డ్రగ్స్ రాకెట్ కేసులో సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీ వేణుగోపాల్ కుమారుడు రాహుల్తేజ* కీలక పాత్ర పోషిస్తున్నట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
కేసు వివరాలు ఇలా...
కొంపల్లి ప్రాంతంలో డ్రగ్స్ సరఫరా జరుగుతున్న సమాచారం ఆధారంగా ప్రత్యేక దళాలు మల్నాడు రెస్టారెంట్, ఇతర ప్రదేశాల్లో సోదాలు నిర్వహించాయి. ఈ దర్యాప్తులో రాహుల్తేజ పేరు ప్రధానంగా చర్చకు వచ్చింది. అతను డ్రగ్స్ నెట్వర్క్కి సూత్రధారిగా వ్యవహరిస్తున్నట్లు ఆధారాలు వెల్లడయ్యాయి. రాహుల్తేజకు మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్యతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ రెస్టారెంట్ ద్వారా డ్రగ్స్ సరఫరా జరుగుతున్నట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నేరచరిత్ర..
ఇది కొత్త కేసు మాత్రమే కాదు. రాహుల్తేజపై గతంలో కూడా నిజామాబాద్లో డ్రగ్స్ కేసు నమోదైంది. అప్పట్లో అతనిపై విచారణ జరిగినప్పటికీ, ఆయనకు మద్యం, మాదకద్రవ్యాలకు సంబంధించి పాత లింకులు ఉన్నట్లు ఇప్పుడు మళ్లీ బలమైన ఆధారాలు లభిస్తున్నాయి.
చట్టపరమైన చర్యలు
రాహుల్తేజపై అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
విచారణను వేగవంతం చేసిన పోలీసులు మరిన్ని నిందితుల కోసం అన్వేషిస్తున్నారు. డ్రగ్ సరఫరా నెట్వర్క్ను పూర్వాపరాలుగా గుర్తించి, దీని వెనుక ఉన్న అసలు ముఠా మీద కూర్చే పనిలో పోలీసులు ఉన్నారు. పోలీసు అధికారి కుమారుడే నిందితుడిగా ఉండటంపై కలకలం.. పోలీసు శాఖలో ఉన్న అధికారుల కుటుంబ సభ్యులు ఇలాంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనడం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనపై పోలీసు శాఖ స్పందించే అవకాశం ఉంది. వాస్తవాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
Post a Comment