హనుమకొండ జిల్లా శాయంపేట మండలం నేరేడుపల్లి గ్రామంలో ఉన్నటువంటి మురళీకృష్ణ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును నేను నాతో పాటుగా స్థానిక ఎస్సై మరియు వారి యొక్క సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ చేయగా వివిధ రకాల కంపెనీలకు చెందిన భయో మందులను గుర్తించడం జరిగింది. ఇట్టి బయోమందులకు ఎటువంటి అనుమతి లేదు పైగా అనుమతి పొందిన స్థలంలో పొరపాటున కూడా నిలువ చేయరాదు అమ్మరాదు ఇటువంటి నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను వీటిని సీజ్ చేయడం జరిగింది వీటి యొక్క విలువ Rs.19,410/- గా గుర్తించడం జరిగింది.
రైతులకు ముఖ్య గమనిక బయోమందుల వల్ల పంటలు నష్టపోయే అవకాశం ఉంది, ఈ విషయమై రైతులకు ఎన్నో మార్లు అవగాహన సదస్సులు కూడా నిర్వహిస్తున్నాము డీలర్లకు కూడా అనేకమార్లు హెచ్చరికలు జారీ చేస్తున్నాము కాబట్టి రైతులు పొరపాటున కూడా భయం మందులు వాడరాదు, డీలర్లు కూడా ఇకమీదట అమ్మటానికి కూడా వీలులేదని సూచనలు చేయడం జరిగింది.
Post a Comment