జాగృతి పోలీస్ కళా బృందం, వరంగల్ నగర పొలీస్ కమీషనర్ .సన్ ప్రీత్ సింగ్ IPS ఆదేశాల మేరకు ఈరోజు సాయంత్రం దామెర గ్రామంలో పోలీస్ కళా జాగృతి ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్,రోడ్డుప్రమాదాలు, డయల్100, బాల కార్మికులు, బాల్య వివాహాలు, సీసీ కెమెరాల ఉపయోగాలు, గుట్క,గంజాయి, డ్రగ్స్,మత్తు పదార్థాల వల్ల యువకులు వారి జీవితాలను నాశనం చేసుకోవద్దని, మూఢ నమ్మకాలు, మరియు 4 G అంశాలపై పాటల ద్వార నాటిక ప్రదర్శన చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి దామెర SI కొంక అశోక్ , హెడ్ కానిస్టేబుల్స్ ,కానిస్టేబుల్ ఆఫీసర్స్, గ్రామ పంచాయతీ సెక్రటరీ ,మరియు జాగృతి కళాబృందం ఇంఛార్జి ASI నాగమణి , కళాకారులు విలియమ్, వేంకటేశ్వర్లు, రత్నయ్య , శ్రీనివాస్, విక్రమ్,చిరంజీవి, మరియు 200 మంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
యువత మత్తుకు బానిస కావొద్దు: దామెర SI కొంక అశోక్
byBLN TELUGU NEWS
-
0
Post a Comment