దామెర మండలం ల్యాదల్ల గ్రామంలోని వికాస్ స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు దామెర SI కొంక అశోక్

 వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ . సూచనల మేరకు (డ్రగ్స్ )మాదకద్రవ్యాల పైన అవగాహన సదస్సు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్రం కావాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు మంచి చదువులు చదివి ఉన్నత స్థాయిలో ఉండాలని ఎలాంటి చెడు వ్యాసనాలకు అలవాటు పడకుండా ఉండి డ్రగ్స్ రహిత సమాజం కోసం పాటుపడాలని పిలుపునిచ్చాడు. విద్యార్థినీ విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించడం కొరకు వారికి డ్రాయింగ్ పోటీలను నిర్వహించి విద్యార్థులకు ప్రథమ మరియు ద్వితీయ బహుమతులను అందించాడు. ఇట్టి కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపాల్ ఎండీ అక్బర్, స్కూల్ టీచర్స్ మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post