ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి కంచ గచ్చిబౌలిని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇక్కడి భూముల్లో అభివృద్ధి ఆటంకాలు తాత్కాలికమేనని..అన్నారు. కంచ గచ్చిబౌలిలో కొత్త కంపెనీల ఏర్పాటుతో 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు* వస్తాయన్నారు. పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ను ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం ప్రసంగించారు.హైదరాబాద్‌ ప్రజల దాహార్తిని తీర్చేందుకు పి.జనార్ధన్‌ రెడ్డి (పీజేఆర్‌) చేసిన కృషి మరువలేనిదని* అన్నారు. ఆయన పోరాటాల వల్లే హైదరాబాద్‌కు కృష్ణా, గోదావరి జలాలు వచ్చాయని తెలిపారు. ఎప్పుడు పిలిచినా పలికే పేదల నాయకుడిగా ఎంతో గొప్ప పేరు సంపాదించారని చెప్పారు. *హైదరాబాద్‌ దోమలగూడలోని పీజేఆర్‌ ఇల్లు ఒక జనతా గ్యారేజీగా కనిపించేదన్నారు.
పీజేఆర్‌ కృషితోనే హైటెక్‌ సిటీ గచ్చిబౌలికి మంజూరైంది. హైటెక్‌ సిటీకి నేదురుమల్లి జనార్ధన్‌రెడ్డి శంకుస్థాపన చేశారు.* ఆయన పునాది రాయి వేస్తే, చంద్రబాబు దాన్ని మరోస్థాయికి తీసుకెళ్లారు అని సీఎం గుర్తు చేశారు. ప్రపంచంలోని నగరాలతో హైదరాబాద్‌ పోటీ పడాలి. *న్యూయార్క్‌, టోక్యో వంటి నగరాలతో హైదరాబాద్‌ పోటీ* పడుతోంది. ఎంత మంది రాక్షసులు అడ్డుపడినా మా యజ్ఞం ఆగదు.రైజింగ్‌ తెలంగాణ-2047 లక్ష్యంతో మాతో అందరూ కలిసి వస్తున్నారని ముఖ్యమంత్రి అన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post