ప్రముఖ న్యూస్​ ఛానెల్​లో పనిచేస్తున్న యాంకర్​ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు

హైదరాబాద్​ చిక్కడపల్లి జవహర్​ నగర్​లోని శీలమ్స్​ రెసిడెన్సిలోని ఆమె నివాసంలో బలన్మరణానికి పాల్పడ్డారు.*పోలీసుల వివరాల ప్రకారం ఐదేళ్ల కిందట భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమె 12 ఏళ్ల కుమార్తె, మరో స్నేహితుడితో కలిసి ఉంటున్నాదని సమాచారం.అతనితో మనస్పర్థల కారణంగా ఆత్మహత్య చేసుకుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 
మృతదేహాన్ని శవపరీక్ష కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వేచ్ఛ తల్లిదండ్రులు రాంనరర్లో ఉంటున్నారు. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపిలో పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేయగా, తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జర్నలిస్టు హౌసింగ్‌ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు. స్వేచ్ఛ మృతి పట్ల జర్నలిస్ట్ సంఘాల నాయకులు, సహచరులు విచారం వ్యక్తం చేశారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post