ఆషాడ మాసం బోనాల ఉత్సవాలతో తెలంగాణలో పండుగ వాతావరణం మొదలవుతుందని అన్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాక్షించారు. *రేపు చారిత్రాత్మక గోల్కొండలో వెలసిన జగదాంబిక ఎల్లమ్మ తల్లికి ఆషాడ మాసం తొలి బోనం సమర్పించడంతో జంటనగరాల్లో బోనాల సందడి నెలకొంటుందని* ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు.అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో జీవించాలని తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని సీఎం రేవంత్రెడ్డి కోరుకున్నారు. రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి సాధించే దిశగా అమ్మవారి దీవెనలు ఉండాలని ఆకాంక్షించారు. జంట నగరాల్లో బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు భక్తుల సదుపాయాల కోసం రూ.20 కోట్ల నిధులు విడుదల చేసిందని వెల్లడించారు.భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు.
బోనాల ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుభాకాంక్షలు
byBLN TELUGU NEWS
-
0
Post a Comment