BLN తెలుగు దినపత్రిక భూపాలపల్లి క్రైమ్: చిట్యాల మండలం చింతకుంట రామయ్య పల్లి గ్రామం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. పోలీసుల వివరాల ప్రకారం.. చిట్యాల మండలం కైలాపూర్ గ్రామానికి చెందిన సకినాల కుమారస్వామి, నవాబ్ పేట గ్రామానికి చెందిన మహమ్మద్ హకీమ్ బైక్ పై వెళ్తుండగా.. మార్గమధ్యలో ఎదురుగా వస్తున్న డీసీఎంను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న చిట్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలోఇద్దరు యువకులు మృతి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment