తాడ్వాయి మండల ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ రెడ్డి పై కాంగ్రెస్ నాయకులు దాడి...

ములుగు జిల్లాదాడిని తీవ్రంగా ఖండించిన బిఆర్ఎస్ పార్టీ గోవిందరావుపేట మండల అధ్యక్షుడు లకావత్ నరసింహ నాయక్
ఇందిరమ్మ ఇండ్ల మంజూరిలో అవకతవకల గురించి ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త రాసినందుకు కాంగ్రెస్ నాయకులు జీర్ణించుకోలేక ఆంధ్రజ్యోతి రిపోర్టర్ శ్రీకాంత్ పై దాడి చేయడం జరిగిందని ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బడే నాగజ్యోతి అన్నారు.
అధికారంలో ఉండి ప్రతిపక్షాలను గొంతు నొక్కాలని చూస్తున్న కాంగ్రెస్ నాయకులు, సమాజంలో జరుగుతున్న అవకతవకలను, లోపాలను వెలికి తీసే జర్నలిస్టులపై సైతం దాడులు చేయడం హేయమైన చర్యఅని మండిపడ్డారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, రాబోవు రోజులలో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు.
విధి నిర్వహణలో ఉండే జర్నలిస్టులపై దాడులు చేయడం ఆప్రజాస్వామ్యక చర్య అని దాడులు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు.
సమాజంలో ఎవరు తప్పు చేసినా పొరపాట్లు చేసిన పత్రికలలో రాసే బాధ్యత ఉంటుందని అన్నారు.
లకావత్ నరసింహ నాయక్
గోవిందరావుపేట మండల అధ్యక్షుడు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post