ముందు ఒప్పుకొని…తర్వాత..
షాపూర్ నగర్ న్యూ ఎల్బీనగర్ లో నివాసం ఉంటున్న అంజలి (39) కి ఇద్దరు కూతుర్లు. మీరు స్థానికంగా ఉన్న ఓ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. పదో తరగతి చదువుతున్న బాలిక (15) కి ఇంస్టాగ్రామ్ లో శివ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయం ప్రేమగా మారడం, ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడం జరిగింది. అనంతరం శివ మృతురాలి అంజలి ఇంటికి తరచుగా వచ్చి వెళ్తుంటాడు. వీరి ప్రేమను అంజలి ముందుగా ఒప్పుకొని తర్వాత ఆక్షేపించింది. అయినప్పటికీ వీరి ప్రేమ విహారం జరుగుతూ వస్తుండటంతో పలుమార్లు అంజలి బాలికను తీవ్రంగా కొట్టిన సందర్భాలు ఉన్నాయి.
హింసిస్తుందని కక్ష గట్టి..
అంజలి మొదటి భర్తకు ఒకరు, రెండో భర్తకు ఒకరు ఇద్దరు ఆడపిల్లలు. వీరిలో మొదటి భర్తకు పుట్టిన బాలిక కన్నా రెండో భర్త ద్వారా పుట్టిన తన చెల్లిని ప్రేమగా చూసుకుంటుందని మదనపడుతూ వస్తుండేది బాలిక. తరచుగా బాలికను కొట్టడం తిట్టడం వంటివి చేస్తూ ఉండటంతో మూడు సంవత్సరాల క్రితం బాలిక ఏడవ తరగతి చదువుతున్న సందర్భంలో పోలీస్ స్టేషన్కు వచ్చి తల్లి అంజలిపై ఫిర్యాదు చేసింది. అనంతరం బాలిక అంజలి వద్దనే ఉన్నది. అయినప్పటికీ వివిధ సందర్భాలలో బాలికను హింసించడం జరుగుతూ రావడం, ఎనిమిది నెలలుగా వీరి ప్రేమ వ్యవహారం విషయంలో ముందుగా ఒప్పుకొని తర్వాత ఒప్పుకోకపోవడం వంటి పరిణామాలు చోటు చేసుకోవడంతో బాలిక తల్లి అంజలి పై కక్ష పెంచుకుంది.
చంపేయాలని ఒత్తిడి..
ఈనెల రెండో వారంలో బాలిక, తన చెల్లెలు శివ ఇంట్లో నాలుగు రోజులు ఉన్నారు. తల్లి అంజలి బలవంతం మీద బాలిక ఇంటికి వచ్చింది. ఈనెల 18న రాత్రి సమయంలో బాలిక ఇంట్లో ఉన్న కొంత నగదు, బంగారాన్ని తీసుకొని శివతో వెళ్ళిపోయింది. 19న అంజలి జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో 20న బాలికను తీసుకొని వచ్చి తల్లి అంజలికి అప్పగించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మంగళవారం బాలికకు వైద్య పరీక్షలు, శివుని కోర్టులో హాజరపరచడం జరగాల్సి ఉండేది. అయితే ఇంతలోనే బాలిక తన ప్రేమికుడైన శివ తో తన తల్లిని చంపేయాలంటూ ఒత్తిడి తీసుకొచ్చింది. ముందు శివ ఒప్పుకోకపోవడం తో తన మాట వినకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించింది. దీంతో శివ తన తమ్ముడు (16) తో కలిసి వచ్చి అంజలి నీ హత్య చేశాడు. ఈ ఘటనలో పోలీసులు శివ ను అరెస్టు చేశారు. కాగా శివ ప్రస్తుతము ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతూ డీజే ఆపరేటర్ గా పని చేస్తున్నాడు.
Post a Comment