మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాద్ కేకన్ ఆదేశానుసారం, మహబూబాబాద్ డిఎస్పీ తిరుపతి రావు, బయ్యారం సిఐ రవికుమార్ సూచనల మేరకు బయ్యారం ఎస్ఐ కే తిరుపతి ఆద్వర్యంలో మండలంలోని రామచంద్రపురం గ్రామంలో కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఇందులో రూ.7000 విలువ గల ఐయంఎప్ఎల్ లిక్కరు, రూ.5000 విలువ గల గుట్కా పాకెట్స్, 10 లీటర్లు గుడుంబా, 500 లీటర్లబెల్లంపానకం పట్టుకొని నలుగురి పైన కేసు నమోదు చేసారు. సరి అయిన పత్రాలు లేని 20 వాహనాలను సీజ్ చేసారు.
అనంతరం ఎస్ఐ తిరుపతి మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్, సైబర్ క్రైమ్స్, గురించి గ్రామస్థులకు అవగాహన కల్పించి, ప్రభుత్వ నిషేధిత గుడుంబా, గంజాయి, గుట్కా, గేమింగ్, నల్లబెల్లం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని చైతన్యపరిచారు.ఈ..కార్డన్ సెర్చ్ లో ఎస్ఐ తిరుపతి తోపాటు, ఆర్ఎస్ఐ పుల్లారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Post a Comment