మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో కలకలం రేపింది.ఇనుగుర్తి కి చెందిన సట్ల అంజలి మహబూబాబాద్ జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాంస్కృతిక సారథి బృంద సభ్యురాలిగా విధులు నిర్వహిస్తోంది. గత నెలలో ఆమె ఇక్కడ నుండి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు బదిలీపై వెళ్ళింది. పదేళ్ల క్రితం వరకు కూడా ఇనుగుర్తి లోనే నివాసముంటున్న అంజలి తల్లి ధనమ్మ కూడా కూతురు వద్దే ఉంటుంది. కరోనా సమయంలో ఒకసారి కుటుంబ సభ్యులంతా ఇనుగుర్తికి వచ్చి ఆ తర్వాత లాక్ డౌన్ అనంతరం తిరిగి హైదరాబాదులో ఉంటున్నారు. సొంత కూతురు చేతిలోనే అంజలి హత్యకు గురైన ఘటన తో ఇనుగుర్తి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పోస్టుమార్టం అనంతరం అంజలి భౌతికకాయాన్ని మంగళవారం రాత్రి ఇనుగుర్తికి తీసుకువచ్చారు.
సాంస్కృతిక సారథి కళాకారిణి సట్ల అంజలి భౌతిక కాయానికి నివాళులర్పించిన డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్...
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కూతురు ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురి అయిన సట్ల అంజలి భౌతిక కాయాన్ని అంత్యక్రియల కోసం పుట్టినిల్లు ఇనుగుర్తికి తీసుకువచ్చారు. గత మాసం వరకు జిల్లాలో పని చేసిన అంజలి బదిలీ పై మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు వెళ్ళిందనీ గత మాసం వరకు ఇక్కడ పనిచేసిన అంజలి స్థానిక కళాకారులతో సామాజిక ఉద్యమాలు, సాంఘిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనేదని డిపిఆర్ఓ రాజేంద్రప్రసాద్, సాంస్కృతిక సారధి జిల్లాఅద్యక్షులు కంబాలపల్లి సత్యనారాయణ తెలిపారు. *దహన సంస్కారాల నిమిత్తం పది వేల రూపాయలను వారి కుటుంబ సభ్యులకు అందించారు.* ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ జిల్లా సాంస్కృతిక సారధి టీం లీడర్స్ కొమ్మిరే వెంకన్న, గిద్దె రాంనర్సయ్య, మెరుగు రవీందర్ గౌడ్, సంస్కృతిక సారి జిల్లా అధ్యక్షుడు కంబాలపల్లి సత్యనారాయణ, బండ వెంకన్న, దర్శనం యుగేందర్, ప్రవీణ్, నరేష్, డప్పు శీను , పాషా, ఐలేష్ , తదితర సభ్యులు పాల్గొన్నారు.
Post a Comment