పరకాల పట్టణంలో TUFIDC నిధులతో జరుగుతున్న పనులను అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి.ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం సీఎంఎస్ గోదాం కాలనీ, యూనియన్ బ్యాంక్ ప్రాంతం, బస్టాండ్ పరిసర తదితర ప్రాంతాలను పరిశీలించారు. డిపిఆర్ కి అనుగుణంగా పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.పరకాల మున్సిపాలిటీని సుందరీకరణ చేసి అభివృద్ధిలో ముందు ఉంచాలని,మున్సిపల్ పరిధిలో అభివృద్ది పనులను సమన్వయం చేస్తూ ముందుకెళ్లాలన్నారు.మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న పనులను వెంటనే పూర్తి చేయడంతో పాటు, కొత్త అభివృద్ధి పనులను ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని ఎంఎల్ఏ అధికారులను ఆదేశించారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మున్సిపాలిటీల అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పని చేయాలని సూచించారు
పరకాల పట్టణాభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని పరకాల శాసనసభ్యులు .రేవూరి ప్రకాశ్ రెడ్డి
byBLN TELUGU NEWS
-
0
Post a Comment