కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
తెలంగాణ హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలను సెప్టెంబర్ 30 లోగా నిర్వహించాలని ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఇప్పటికే బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మద్దతు ప్రకటించారని, ప్రధాని మోడీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చారని గుర్తు చేశారు. బీసీ రిజర్వేషన్లను ఇవ్వాల్సిన అధికారం, స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు
Post a Comment