కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది
రైతును రాజు చేయాలనే సంకల్పంతో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుంది
రైతులు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం దేశం అభివృద్ధి సాధ్యం
పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు నిర్వహించిన సేంద్రియ మరియు ప్రకృతి వ్యవసాయం పై రైతు అవగాహన సదస్సులో నిర్వహించిన కార్యక్రమంలో అధికారులతో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు పలు సూచనలు సలహాలు అందించారు. ఎమ్మెల్యే శ్రీ రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ....ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా రైతులు మారాలని అన్నారు.తరతరాలుగా వస్తున్న సంస్కృతి వ్యవసాయం అని, దేశ వ్యవసాయ రంగం ప్రపంచానికే అగ్రస్థానం అని అన్నారు. ప్రపంచ మార్కెట్లో పోటీపడి రైతులు పంటలు పండించినప్పుడే దేశం ఉన్నత స్థాయికి ఎదుగుతుందని, రైతులు గౌరవంగా జీవించగలుగుతారన్నారు. పిఎసిఎస్ లో వ్యాపార దృక్పథం పోయి రైతు శ్రేయస్సుకు పనిచేసినప్పుడే రైతులు అభివృద్ధికి కృషి చేసిన వారు అవుతారన్నారు. సేంద్రీయ పంట వ్యవసాయ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, మండలానికి 125 మంది రైతులు ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. రైతులు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం దేశం అభివృద్ధి సాధ్యమని అన్నారు. రాష్ట్ర ఆదాయం 34% రైతుల నుండే వస్తుందని, రైతుల ఆదాయం పెరిగితేనే రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెరుగుతుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతాంగా అభివృద్ధికి కృషిచేస్తుందన్నారు
Post a Comment