ఫార్మర్ రిజిస్ట్రి

ఆధార్ తో దేశంలోని ప్రతి పౌరునికి గుర్తింపు ఇచ్చినట్లుగానే ప్రతి రైతుకు 11 నెంబర్లతో విశిష్ట సంఖ్య (యూనికోడ్) ని కేటాయించాలని కేంద్రం నిర్ణయించింది. వ్యవసాయ రంగాన్ని పూర్తిగా డిజిటలైజ్ చేయాలనే సంకల్పంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ ప్రాజెక్టును చేపట్టడం జరుగుతుంది.
భూమి ఉన్న ప్రతి రైతు తనకు ఉన్న భూములకు సంబంధించిన వివరములతో కూడిన సమాచారంతో ఈ ఫార్మర్ రిజిస్ట్రీ నిర్మించబడుతుంది. రెవెన్యూ శాఖ ద్వారా సేకరించిన భూ యాజమాన్య వివరములను రైతు యొక్క ఆధార్ సంఖ్యను అనుసంధానం చేయడం ద్వారా ఈ ఫార్మర్ ఐడి ని కేటాయించడం జరుగుతుంది.
ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు ఏ రకమైన చట్టబద్ధ యాజమాన్య హక్కును కల్పించదు. కేవలం రెవెన్యూ శాఖ వద్ద ఉన్న భూ యాజమాన్య వివరాలను ప్రామాణికంగా తీసుకొని ఈ రైతులకు ఫార్మర్ ఐడి కేటాయించడం జరుగుతుంది.
కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనుసంధానం చేయడం జరుగుతుంది. పిఎం కిసాన్ లబ్ధిదారులకు తదుపరి విడత లబ్ధి పొందుటకు ప్రామాణికంగా ఫార్మర్ రిజిస్ట్రీలో నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వ సంబంధిచిన పథకాలు అయిన రైతు భరోసా రుణమాఫీ తదితర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ రిజిస్ట్రీకి ఏ రకమైన సంబంధం లేదు.రైతు విశిష్ట సంఖ్యను (ఫార్మర్ ఐడి) పొందుటకు మీ ఆధార్ మరియు భూ యాజమాన్య పాస్ పుస్తకము ఆధార్ కు లింక్ చేయబడిన మొబైల్ నెంబరు తీసుకొని సమీపంలోని వ్యవసాయ అధికారి లేదా వ్యవసాయ విస్తరణ అధికారిని సంప్రదించి ఫార్మర్ ఐడీకి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.తహరాపూర్ విలేజ్ లో అటెండ్ అవడం జరిగింది, ఇందులో aeo రాకేష్ మరియు రైతులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post