మట్టి వ్యాపారుల నుండి చెరువులను కాపాడండి:మూడు రవిలంబాడ హక్కుల పోరాట సమితి నాయకుడు

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో మట్టి వ్యాపారుల అక్రమదందా రోజురోజుకి పెరిగిపోతుంది ఒకప్పుడు చెరువులలో రజకులు, మత్స్యకారులు చెరువులను వారి వృత్తిని కొనసాగించేవారు. ఈ మట్టి వ్యాపారులు చెరువులలో అక్రమంగా గుంతలు తీసి అక్రమంగా మట్టి, మొరం తరలించడం వల్ల చెరువులో దిగాలంటే రజకులు మత్సకారులు భయపడుతున్నారు. మన పూర్వీకులు చెరువులో దిగి పశువులను నీరు తాపడం ,ఈత కొట్టడం లాంటి పనులు చేసేవారు.ఇప్పుడు చెరువులను చూస్తుంటేనే రైతులు ప్రజలు బెంబేలెత్తుతున్నారు ఎక్కడ ఏ గుంత ఉందో అందులో దిగితే ఏ ప్రమాదం జరుగుతుందని భయపడుతున్నారు ఈ మట్టి వ్యాపారుల బారి నుండి చెరువులను కాపాడాలని లంబాడా హక్కుల పోరాట సమితి మండల నాయకులు మూడు రవి నల్లబెల్లి మండలం తాసిల్దార్ ముప్పు కృష్ణకు వినతిపత్రం ఇచ్చి చెరువులను కాపాడాలని కోరారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post