హెలిప్యాడ్ వద్దజాయ్ రైడ్ హెలికాప్టర్, సరస్వతి ఘాట్ ను ఆదివారం ఉదయం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు. భక్తులు కాళేశ్వరం అందాలను వీక్షించేందుకు అనువుగా జాయ్ రైడ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం సరస్వతి ఘాట్ ప్రాంతాలను పరిశీలించారు. ఏర్పాట్లను సమీక్షిస్తూ, వాకీటాకీ ద్వారా అధికారులకు తక్షణ ఆదేశాలు జారీ చేశారు.ఆదివారం భక్తుల రద్దీ పెరుగుతుందని, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా అధికారులు వారి కేటాయించిన విధుల్లో అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. ప్రతి విభాగం అధికారులు వారి ప్రదేశాల్లో నిరంతరం పర్యవేక్షణ చేపట్టి, భద్రతా ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టంగా ఆదేశించారు. స్నాన ఘాట్స్ వద్ద పరిశుభ్రత పాటించాలని సూచించారు
భక్తుల సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని, శుభ్రత, నీటి సరఫరా, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖల అధికారులు తక్షణ చర్యలు చేపట్టారు.
Post a Comment