నిర్మల్ జిల్లాలోని బాసర రాజీవ్ గాంధీ ట్రిపుల్ ఐటీలో 2025_26 విద్యా సంవత్సరానికి గాను ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో చేరేందుకు నోటిఫికేషన్ ను వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ విడుదల చేశారు. ఈ నెల 31 నుంచి జూన్ 21 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. జూలై 4 న ప్రొవిజనల్ జాబితా విడుదల చేసి, జూలై 7 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. బాసర లోని 1500 సీట్లకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో రెగ్యులర్ విద్యార్థులు సాధించిన మార్కుల ఆధారంగా ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వేషన్ కల్పిస్తామని తెలిపారు. ఆర్జియుకేటి గవర్నింగ్ కౌన్సిల్ ఆమోదం మేరకు ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులకు 4 మార్కుల చొప్పున కలుపుతారు.ఒక వేళ ఇద్దరు విద్యార్థుల మార్కులు సమానంగా ఉంటే వరుస క్రమంలో గణితం, సైన్స్, ఆంగ్లం, సాంఘిక శాస్త్రం, ఫస్ట్ లాంగ్వేజ్ లో సాధించిన మార్కుల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. అప్పటికీ సమానంగా ఉంటే జన్మ తేదీని ప్రామాణికంగా తీసుకుంటారు. ఆన్ లైన్ లో అభ్యర్థన పత్రం సమర్పించేందుకు https: www.rgukt.ac.in/ లో ఫాం నింపాల్సి ఉంటుంది. అభ్యర్థన సబ్మిట్ చేసాక అప్లికేషన్ ఐడి వస్తుంది. అనంతరం దరఖాస్తు ఫీజు ఓసీ, బీసీ లకు రూ.500, ఎస్సీ, ఎస్టీలకు రూ.450, అలాగే ఇతర రాష్ట్రాల వారైతే రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ప్రింటవుట్ తీసి, స్పోర్ట్స్, ఎన్ సి సి, తదితర కేటగిరి విద్యార్థులు అప్లికేషన్ ను పోస్ట్ ద్వారా జూన్ 25 లోగా కన్వీనర్, యూ జీ అడ్మిషన్స్ 2025-26, ఆర్ జి యు కె టి బాసర, జిల్లా నిర్మల్, తెలంగాణ - 504107 కు పంపించాల్సి ఉంటుందన్నారు.
బాసర ట్రిపుల్ ఐటీ లో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల
byBLN TELUGU NEWS
-
1
Useful information
ReplyDeletePost a Comment