విజేందర్ రావు కుటుంబాన్ని పరామర్శించిన చల్లా..

పరకాల మండలం వెంకటాపూర్ గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బొంపెల్లి విజేందర్ రావు తల్లి ప్రమీల ఇటీవలే మృతిచెందగా నేడు వారి కుటుంబాన్ని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరామర్శించారు.ఈ సందర్భంగా ప్రమీల చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె మృతికిగల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.కార్యకర్తల కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని మాజీ ఎమ్మెల్యే తెలిపారు.
ఈ కార్యక్రమంలో మండల బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post