కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని అన్నారు. మండలంలోని గోవిందాపూర్, పెద్ద కోడేపాక, జోగంపల్లి, మైలారం, శాయంపేట, ఆరేపల్లి గ్రామాలలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తుత్తి మాటలతో నటిస్తున్నదని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయిందని అన్నారు. ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని గ్రామ సభలు పెట్టి లిస్టు చదివి వినిపించడం తప్ప ఒక్కటి ఇవ్వలేదని ఆరోపించారు. ఇస్తామని చెప్పి నటించడం తప్ప ఇచ్చేది లేదని అన్నారు. ప్రభుత్వం వద్ద ఖజానా లేదని ముఖ్యమంత్రి స్వయంగా చెప్తున్నాడని అన్నారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారని అన్నారు. రాజ్యాంగాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. గ్రామాలలో కాంగ్రెస్ సోల్లె పంచాయతీలు చేస్తున్నారని అన్నారు. చివరికి పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీలు చేస్తూ ఏజెంట్లుగా మారుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదని అన్నారు. త్వరలోనే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్ నిజమైన తెలంగాణ సంరక్షకుడు అని అన్నారు. ఆయన ఉన్నప్పుడు రాష్ట్రం శస్యశ్యామలంగా ఉందని అన్నారు. భారతదేశంలో నెంబర్ వన్ గా నిలిచిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మీడియా వాళ్లును కూడా బెదిరిస్తున్నదని అన్నారు. బిఆర్ఎస్ రజతోత్సవ సభకు ప్రజలు అధిక సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయింది
byBLN TELUGU NEWS
-
0
Post a Comment