అంబేద్కర్ కు గుర్తింపు లేకుండా చేయాలని అడుగడుగు ప్రయత్నం చేసింది కాంగ్రెస్

శాయంపేట మండల కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు ఏడునూతుల నిశిధర్ రెడ్డి మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి హాజరై అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
అంబేద్కర్ ని అడుగడుగునా అవమానించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనివ్వకుండా ముంబైకి వారి పార్థివదేహాన్ని తరలించి, ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీల బిల్లులు చెల్లించాలని అంబేద్కర్ సతీమణి బిల్లులు పింపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
శ్యామా ప్రసాద్ ముఖర్జీ, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఆలోచనా విధానాన్ని బలపరిచిన అంబేద్కర్ కు, ఆయన ఆలోచనలకు గౌరవ ప్రధానమంత్రి Narendra Modi గారి ప్రభుత్వం తగిన గౌరవం ఇస్తోంది. భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేయడంతో పాటు, దళితుడైన రామ్ నాథ్ కోవింద్ ను, ఆదివాసీ బిడ్డ ద్రౌపది ముర్ము రాష్ట్రపతి చేసింది. అణగారిన వర్గాల్లో వెలుగులు నింపిన అంబేద్కర్ కు భారతరత్న కోసం బిజెపి కృషి చేసింది. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా 12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు మోదీ ప్రభుత్వం తమ కేబినెట్ లో చోటు కల్పించింది. అంబేద్కర్ కలలను సాకారం చేస్తూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు మోదీ ప్రభుత్వం అభివృద్ధిని పరిచయం చేసింది అని వారు అన్నారు అదేవిధంగా మండలంలోని పెద్ద కోడెపాక, మైలారం, కొప్పుల గ్రామాలలో మరియు వివిధ బూతులలో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి, జిల్లా కౌన్సిల్ మెంబర్ కానుగుల నాగరాజు, జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షుడు ఉప్పు రాజు, యువ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కొత్తపల్లి శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి మామిడి విజయ్,దళిత మోర్చా మండల అధ్యక్షుడు మంద సురేష్, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి, భూత్ అధ్యక్షులు పున్నం సాంబయ్య, కొంగరి సుధాకర్, కడారి చంద్రమౌళి, బత్తుల రాజేష్, కన్నెబోయిన రమేష్, ముల్కనూరు వెంకటేష్, మంద మధు, పైడి మల్ల సుధాకర్, వంగల భాస్కర్ రెడ్డి, మూడేళ్ల పైడి సీనియర్ నాయకులు, మేకల సుమన్, భూతం తిరుపతి బత్తుల రవి కోమటి రాజశేఖర్, మోరే తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post