శాయంపేటలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
అంబేద్కర్ ఆశయాల సాధనకు కృషి చేయాలన్న ఎమ్మెల్యే..
బస్టాండ్ సెంటర్ నుండి రైతు వేదిక వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే..
ఈరోజు సోమవారం భారతరత్న డా.బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా భూపాలపల్లి నియోజకవర్గం శాయంపేట లోని అంబేద్కర్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి పూల మాల వేశారు. అనంతరం అంబేద్కర్ సెంటర్ నుండి రైతు వేదిక వరకు పాదయాత్ర చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.... అంబేద్కర్ ఆశయ సాధన కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. ఇందులో భాగంగానే ఎస్సీ వర్గీకరణతో మూడు దశాబ్దాల పోరాట ఆకాంక్షలు నెరచేర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అదేవిధంగా, యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ ఇంటిగ్రేటెడ్ స్కూళ్లతో నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, రైతులకు, రైతు కూలీలకు ఎకరాకు రూ.12 వేల ఆర్థిక భరోసా ఇస్తున్నట్లు తెలిపారు. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్ల పథకం, భూ భారతికి శ్రీకారం చుట్టడం ఆ మహనీయుడికి ఘన నివాళి అని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
Post a Comment