సర్పంచ్ భిక్షాటన పెండింగ్ బిల్లులు చెల్లించాలని..

పరకాల: పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట
సర్పంచ్ భిక్షాటన చేశారు. వివరాల్లోకి వెళితే పరకాల నియోజకవర్గం నడికూడ తాజా మాజీ సర్పంచ్ ఊడ రవీందర్ రావు తాను చేసిన అభివృద్ధి పనుల బిల్లులు రాలేదంటూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన వ్యక్తం చేసాడు. గత ప్రభుత్వం బిల్లులు వెంటనే విడుదల చేసేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో అప్పుల్లో కూరుకు పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ హనుమకొండ కలెక్టరేట్ ఎదుట బిక్షాటన చేస్తూ నిరసన తెలిపారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post