రోగులతో మర్యాదగా ప్రవర్తించాలి డీఎంహెచ్ అప్పయ్య

శాయంపేట: మండల కేంద్రంలోని ప్రాథమిక
ఆరోగ్య హెల్త్ సెంటర్లో త్వరలో 24 గంటల వైద్య సేవలు అందుబాటులో రానున్నాయని డీఎంహెచ్వో అప్పయ్య తెలిపారు. శాయంపేట పీహెచ్ సీ హెల్త్ సెంటర్లో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆరోగ్య మహిళ క్లినిక్  లో మంగళవారం జిల్లావైద్య అధికారి అప్పయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష కోసం వచ్చిన మహిళలతో మాట్లాడినప్పుడే, ప్రతీ మంగళవారం మహిళలు తమ ఆరోగ్య సమస్యలను వైద్యురాలితో పంచుకొని తగిన వైద్యం పొందాలని సూచించారు. ఈ రోజు 32 మంది మహిళలు పరీక్షించుకున్నారు. గత ఒక సంవత్సరంలో 2822 మంది మహిళలను పరీక్షించి, 35 మంది మహిళల రక్త నమూనాలను టీ-హబ్ హన్మకొండకు పంపినట్లు మండల వైద్యాధికారి సాయి కృష్ణ, అపర్థ తెలిపారు. పీహెచ్ సీ సిబ్బంది పని తీరుపై అడిగి తెలుసుకున్న డీఎంహెచ్, ప్రతి పేషెంట్ తో మర్యాదగా ప్రవర్తించాలని, వేసవికాలంలో వడదెబ్బ నివారణ చర్యలు తీసుకోవాలని సూచించారు. త్వరలోనే 24 గంటల వైద్య సదుపాయం అందుబాటులోకి రానున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సీ డాక్టర్లు, ఫారామెడికల్ సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post