శాయంపేట మండలంలోని 24 గ్రామాలలో ఉచితంగా కంటి పరీక్ష క్యాంపు నిర్వహించా


 శాయంపేట మండలంలోని ప్రగతి సింగారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో ఈరోజు ఉదయం కంటి పరీక్ష క్యాంపు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వరంలో లయన్ విజన్స్ క్లబ్ సహకారంతో నాలుగో విడతలో భాగంగా నిర్వహించడం జరిగింది దాదాపుగా ఆ గ్రామ వృద్ధులు 80 మందికి ఉచితంగా కంటి బీపీ షుగర్ థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవడం జరిగింది అందులో ఒక 35 మందిని కంటి ఆపరేషన్ కి ఎన్నుకోవడం జరిగింది వారికి ఉచితంగా బస్సు భోజనము పడక కల్పిస్తూ హైదరాబాదులోని పుష్పగిరి ఆసుపత్రికి తీసుకుపోయి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయించడం జరుగుతుందని శాయంపేట మండలంలోని 24 గ్రామాలలో ఉచితంగా కంటి పరీక్ష క్యాంపు నిర్వహించాలనే సంకల్పంతో ఈ రోజుల్లో కన్నా కొడుకులు కూతుర్లు తల్లితండ్రులను పట్టించుకోలేని రోజుల్లో తీన్మార్ మల్లన్న టీం ముందుండి వారికి ఇంటి పెద్ద బిడ్డ లాగా వారికి సహాయం చేస్తున్నారని ఒక గొప్ప అనుభూతి కలుగుతుందని శాయంపేట తీన్మార్ మల్లన్న టీం మండలాధ్యక్షులు తీన్మార్ జయ్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో తీన్మార్ మల్లన్న టీం సభ్యులు పెద్ద ఎత్తున వృద్ధులు గ్రామ పెద్దలు తీన్మార్ జయ్ పెద్దిరెడ్డి వేముల రమేష్ శానం కుమార్ స్వామి సుమన్ తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post