పాకాల తూములు, లైనింగ్ మరమ్మత్తుకునిధులు మంజూరు చేయండి

అసెంబ్లీలో ప్రభుత్వాన్ని కోరిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట ప్రజల దాహార్తి తీర్చేందుకు నిధులు మంజూరు చేయాలి.
 పేదల ఇండ్లపై ఉన్న హై వోల్టేజ్ విద్యుత్ వైర్లను తొలగించాలి
BLN తెలుగు దినపత్రిక, నర్సంపేట: తెలంగాణ శానససభ సమా వేశాల్లో భాగంగా మంగళవారం నర్సంపేట శాసనన భ్యులు దొంతి మాధవ రెడ్డి నియోజకవర్గ సమస్యలపై

ప్రసంగించారు. పాకాల సరస్సు నుండి అధికారికంగా 30 వేల ఎకరాలు అనధికారికంగా మరో 10 వేల ఎకరాల్లో రెండు పంటలు సాగవుతున్నాయని, చివరి ఆయకట్టు వరకు నీరు వెళ్లడానికి కాలువలు మరమ్మత్తు వేయాలని, తూముల లీకేజీ ద్వారా బదారు వేల ఎకరా లకు ఉపయోగపడే నీరు వృథాగా పోతుందని వాటి మర మ్మత్తుకు నిధులు కేటాయించాలని కోరారు. పై పనుల కోసం గతంలోనే కోరామని ఉప ముఖ్యమంత్రి నుండి ఆమోదం పొందినా ఇంకా పనుల మంజూరుకి నిధులు ఇవ్వలేదని వెంటనే నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. నర్సంపేట పట్టణంలో సుమారు

70 వేల జనాభాకు తాగునీటి కోసం మిషన్ భగీరథ ఏ ర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అందక ఇబ్బందులు పడుతున్నారని, డీఫ్లోరైడ్ ప్రాజెక్ట్ మరమ్మత్తు ద్వారా ప ట్టణ ప్రజలకు పూర్తిస్థాయిలో తాగునీరు అందే అవకాశం ఉందని అట్టి పనులకు సైతం అంచనాలు పంపించాను. ని, పేదల ఇండ్లపై నుండి వెళ్తున్న హై వోల్టేజ్ వైర్లు తొల గించేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post