సాగునీరు అందించాలిడీబీఎం 38 కెనాల్.నుపునరుద్దరించాలినాలుగు మండలాలను సస్యశ్యామలం చేయాలి* అసెంబ్లీలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు

భూపాలపల్లి: భూపాలపల్లి నియోజక వర్గంలోని డీబీఎం 38 కెనాల్ను పునరుద్ధరించి పంట పొలాలకు సాగు నీరందించాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు కోరారు. ఈమేరకు అసెంబ్లీలో మంగళవారం డీబీఎం 38 కెనాల్ మరమ్మతుపై ఆ యన మాట్లాడారు. గతంలో 1988లో ఎన్టీఆర్ ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు శంకుస్తాపన చేశారన్నారు. 35 సంవత్సరాలు గడుస్తున్నా.. 82 కిలోమీటర్లు ఉన్న కా లువ నిరుపయోగంగా మారిందన్నారు. గత ప్రభు త్వంలో అనేకసార్లు విన్నవించినా ప్రయోజనం లేకుం డా పోయిందన్నారు. 2028, 19లో బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.200 కోట్లు ఖర్చు చేసినా చుక్క నీరు దాలేదన్నారు. 44 వేల పైచిలుకు ఎకరాలకు సాగు నీ రందించే, గోరికొత్తపల్లి, రేగొండ, చిట్యాల, టేకుమట్ల మండలాలకు సస్యశ్యామలం చేసే కెనాల్ను పునరు ద్దరించాలని ఆయన కోరారు. ఫేజ్ టూ దేవాదుల నుంచి చలివాగుకు వచ్చే లైన్కు గోరికొత్తపల్లి వద్ద లింక్ కలిపితే ఈ నాలుగు మండలాలకు నీరందు తుందని, ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేయాలని గండ్ర కోరారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post