కేసుల ఆన్లైన్ ఫైలింగ్ మరియు ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల నివారణ పై జరిగిన సమావేశాలు

ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ పి. నారాయణ బాబు నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ లో కేసులను ఎలా ఫైల్ చేయాలి, ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాల పట్ల ఎలా జాగ్రత్త వహించాలి అనే అంశాల మీద జిల్లా కోర్టులో శనివారం సమావేశాలు జరిగాయి. జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ పి. నారాయణ బాబు హాజరయ్యి సమావేశాల్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ డిజిటల్ లిటరసీ అనేది చాల ముఖ్యం అన్నారు. కేసుల ఈ ఫైలింగ్ విధానం తెలిసినప్పుడు దేశ వ్యాప్తంగా ఎక్కడైన కేసులను వేసుకునే వీలుంటుందని తెలిపారు. విలువైన సమయం, డబ్బులు పొదుపు అవుతాయని మరియు ప్రయాణ భారం తగ్గుతుందని జడ్జి అన్నారు. ఈ రోజుల్లో ఆన్లైన్ బ్యాంకింగ్ మోసాలు ఎక్కువయ్యాయని వాటి పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు. ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, సోషల్ మీడియా, ఏ టి ఎం ల ద్వారా పెద్ద ఎత్తున ఆర్థిక నేరాలు జరుగుతున్నాయని, జాగ్రత్త వహించాలని అన్నారు. రిసోర్స్ పర్సన్ లు పి. సాయి చరణ్, కే. రాకేష్ మరియు ఐ సి ఐ సి ఐ బ్యాంకు ప్రతినిధులు అనిల్, శ్రీకాంత్ లు పి.పి.టి ప్రెసెంటేషన్లు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీనియర్ సివిల్ జడ్జి మరియు న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కే. జయరాం రెడ్డి , ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి ఎన్. రామచంద్ర రావు , అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి జి. అఖిల , చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్  అనితావని , అడ్వొకేట్స్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూనూరి సురేష్ కుమార్ , ప్రధాన కార్యదర్శి బల్ల మహేందర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏదులాపురం శ్రీనివాస్ , చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ మెరుగు రవీందర్ , డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్  అక్షయ , అసిస్టెంట్ చీఫ్ లీగల్ ఎయిడ్  జి. ప్రియాంక , జి.పి. ఇందరపు శివకుమార్ , న్యాయవాదులు ఆనంద రావు రవీందర్ , రజినీకాంత్ , కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post