BLN తెలుగు దినపత్రిక.ఏటూరునాగారం : 25 ఏళ్లుగా భద్రత దృష్ట్యా మూసి వేసిన గేట్లు తెరుచుకున్నాయి.
ఏటూరునాగారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ముందు జాతీయ రహదారిపై 25 ఏళ్లుగా మూసి ఉన్న గేట్లను శనివారం తీయడంతో వాహనాల రాకపోకలు మొదలయ్యాయి. 2001 సంవత్సరంలో అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పై దాడి చేసి ఐదుగురిని హతమార్చారు. అయితే ప్రధాన రోడ్డు పోలీస్ స్టేషన్ ముందు నుండి ఉండడంతో ఇనుప గుండ్లు ఉన్న మందుపాతరను ట్రాక్టర్లలో అమర్చి పేల్చివేశారు.
అప్పటి ఘటనతో భద్రతపరంగా పోలీస్ అధికారులు ఆ రోడ్డుపై వాహనాలు వెళ్లకుండా రెండు వైపులా మూసి వాహనాలను వేరే మార్గంలో వెళ్లేలా ఏర్పాటు చేశారు. అయితే ఇటీవల ఇసుక లారీల వలన ఆ రోడ్డు భారీ గుంతల మయమై రాకపోకలకు ఇబ్బందిగా మారడంతో శనివారం పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు 25 ఏళ్ల క్రితం మూసిన గేట్లను ఎత్తివేశారు. అయితే ఈ గేట్లను ఉదయం నుంచి సాయంత్రం వరకు మాత్రమే తీసి ఉంచి రాత్రి సమయంలో మూసివేస్తారని
Post a Comment