మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం కొరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్..

భూపాలపల్లి, 1 మార్చి 2025:
వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం కొరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకుని, ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఈరోజు శనివారం భూపాలపల్లి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ఎమ్మెల్యే ఒక ప్రకటనలో తెలిపారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు లేఖలు అందజేసి విజ్ఞప్తి చేయడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరునుందని ఎమ్మెల్యే అన్నారు. వరంగల్ మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. మామునూరు ఎయిర్ పోర్ట్ నిర్మాణం కొరకు సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖకు లేఖలు అందజేసి విజ్ఞప్తి చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఎమ్మెల్యే గుర్తు చేశారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post