ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
BLN తెలుగు దినపత్రిక హైదరాబాద్: రాష్ట్రంలో మరోమారు కుల గణన జరుగనున్నది. ఈనెల 16-28 తేదీల మధ్య కుల గణన నిర్వహిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క బుధవారం మీడియాకు చెప్పారు. కుల గణన సర్వేలో పాల్గొనని 3.1 శాతం వారి కోసం మరో అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపారు. అటుపై అసెంబ్లీ ఆమోదంతో శాసనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మార్చి మొదటి వారంలో కేబినెట్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కల్పన కోసం బిల్లును ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతామని మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో ఆమోదిం చేలా కృషి చేస్తాం అని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Post a Comment