వేములవాడ టు ధర్మారం

హత్య మిస్టరిని ఛేదించిన పోలీసులు'
▪ వివరాలు తెలిపిన ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్
BLN తెలుగు దినపత్రిక  పరకాల : 2023 లో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు పరకాల పోలీస్ స్టేషన్ లో ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్ బుధవారం మీడియా సమావే శంలో వివరాలు వెల్లడించారు. 2023 జూన్ లో శాయంపేట మండలం ఆరెపల్లి గ్రామానికి చెందిన వాడికారి బొందమ్మ ఆస్తి పంపకాల్లో తన బిడ్డలకు ఆస్తి ఇవ్వకుండా నిందితుడు ఇంటి రాజిరెడ్డి అడ్డుపడుతున్నాడని నిందారోప ణలు చేసింది. దీంతో పగ పెంచుకున్న రాజిరెడ్డి బొందమ్మను ఎలాగైనా అంతమొందించేందుకు కుట్ర పన్నాడు. ఈ క్రమంలో ఎవరూ లేని సమయంలో బొందమ్మను ఇంటికి పిలిపించుకున్న రాజిరెడ్డి ఆమెపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన బొందమ్మ అక్కడి కక్కడే మృతి చెందింది. దీంతో మృతదేహాన్ని ధర్మారం శివా రులోని కెనాల్ వద్ద పడేసి ఆమెపైనున్న బంగారు నగలు తీసుకుని వెళ్లాడు. కాగా, మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. శాయంపేట సీఐ రంజిత్ కుమార్, పరకా ల సీఐ క్రాంతి కుమార్ టీంలు గా ఏర్పడి నిందితుడిని పట్టు కున్నట్లు తెలిపారు. సీఐలు, సిబ్బందిని ఈస్ట్ జోన్ డీసీపీ రవీందర్, పరకాల ఏసీపీ సతీష్ బాబు సన్మానించి రివార్డ్ అందజేశారు. కార్యక్రమంలో పరకాల ఎస్ఐ శివకృష్ణ, దామెర ఎస్సై అశోక్, శాయంపేట ఎస్సై పరమేష్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post