ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ఆరా తీశారు.

నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఫోన్ చేసి ఆరా తీశారు. ముఖ్యమంత్రి ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రధానమంత్రి తెలియజేశారు. 
సొరంగంలో ఎనిమిది మంది కార్మికులు చిక్కుకున్నారని, వారిని కాపాడేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టామని ప్రధానికి వివరించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు దగ్గరుండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారని ప్రధానమంత్రి చెప్పారు.
సహాయక చర్యల కోసం వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని పంపిస్తామని మోదీ ముఖ్యమంత్రి తెలిపారు. పూర్తిస్థాయి సహకారం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ప్రమాదం జరిగిందని తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి వెంటనే మంత్రులను, అధికారులను అప్రమత్తం చేశారు. ఉదయం నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి జూపల్లి కృష్ణారావు తో పాటు డీఐజీ, నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులను హుటాహుటిన ప్రమాదస్థలికి పంపించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్థానిక అధికారులు, ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్ఆర్డీఎఫ్ బృందాలతో పాటు ఇతర సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post