BLN తెలుగు దినపత్రిక : కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 16 నుంచి చేపడుతున్న కుల గణన రీ సర్వేలో పద్మశాలి కులస్థులు అందరూ పద్మశాలి కులాన్ని ఎన్యుమరే టర్లతో స్పష్టంగా నమోదు చేయించుకో వాలని తెలంగాణ రాష్ట్ర మినిమం వేజెస్ అడ్వైజరి కమిటీ మెంబర్ బాసా ని చంద్రప్రకాష్ శనివారం ఒక ప్రకట నలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన బీసీ డిక్లరేషన్ లో భాగంగా ప్రతి కుటుంబానికి కులగణనను మరో మారు రీ సర్వే చేపడుతుందని అన్నా రు. పద్మశాలీ కులస్థులందరూ కాలం 7లో నేతకాని, శాల అని రాయిం చకుండా పద్మశాలీ అని స్పష్టంగా నమోదు చేయించాలని సూచించారు.
కులగణనలో పద్మశాలి కులస్థుల జనాభా కూడా ప్రభుత్వానిక తెలుస్తుందన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెరిగే అవకాశం లభిస్తుందని అందుకే ప్రతి పద్మశాలి కులస్తుడు రీ సర్వేలో పద్మశాలీ అని తప్పకుండా రాయించుకోవాలని మాజీ ఎంపిపి చంద్ర ప్రకాష్ తెలిపారు.
Post a Comment