శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో ప్రమాదం చోటు చేసుకుంది.

సొరంగంలో ఏర్పాటు చేసిన రింగ్లు కిందపడటంతో పైకప్పు కూలి ఇద్దరు కార్మికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సొరంగంలో చిక్కుకున్న 8 మంది కార్మికుల కోసం రక్షణ చర్యలు చేపట్టారు. సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు ఘటనా స్థలికి చేరుకుని సహాయకచర్యలు పర్యవేక్షిస్తున్నారుసొరంగంలో చిక్కుకున్న 8 మంది... దోమలపెంట సమీపంలోని ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. శ్రీశైలం ఎడమగట్టు కాలువ టన్నెల్ 14వ కిలోమీటర్ వద్ద సొరంగంలో ఏర్పాటు చేసిన రింగ్లు కిందపడటంతో 3 మీటర్ల మేర పైకప్పు కూలింది. దీంతో ఇద్దరు కార్మికులకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఉదయం షిఫ్ట్ సొరంగంలో పనులకు 50 మంది లోపలికి వెళ్లారు. ఒక్కొక్కరిగా 42 మంది సొరంగం నుంచి కార్మికులు బయటకు వచ్చారు. మరో 8 మంది సొరంగంలో చిక్కుకుపోవడంతో వారిని బయటకు తీసుకువచ్చేందుకు రక్షణ చర్యలు చేపట్టారు.కూలీలు పంజాబ్‌, జమ్మూకశ్మీర్‌, యూపీ వాసులుగా గుర్తించారు. సొరంగంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. పోలీసుల సాయంతో సహాయకచర్యలు కొనసాగుతున్నాయి. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల కిందటే మళ్లీ పనులు మొదలయ్యాయి.ఘటనపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి : ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టన్నెల్ వద్ద పై కప్పు కూలి పలువురికి గాయాలైన సమాచారం అందిన వెంటనే ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్. ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదలశాఖ అధికారులు వెంటనే అక్కడికి చేరుకొని సహాయక చర్యలు అందించాలని సీఎం ఆదేశించారు. ఘటన జరిగిన తీరు, టన్నెల్లో ఎంత మంది ఉన్నారన్న సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యల్లో ఇతర విభాగాల సహకారం తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సీఎం ఆదేశాలతో నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రత్యేక హెలీకాప్టర్ లో ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారు. ప్రమాదం జరిగిన తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అటు మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రమాద స్థలానికి చేరుకుని ఉత్తమ్‌తో పాటు సహాయ చర్యల్లో పాల్గొన్నారునిపుణులైన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని తీసుకువస్తాం : ప్రమాదం జరిగిన తీరును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో వివరించారు. ఉదయం 8 గంటలకు కార్మికులు లోపలకు వెళ్లారని ఆయన తెలిపారు. 8.30కు టన్నెల్‌ బోరింగ్‌ మిషన్‌ను ఆన్‌ చేశారన్నారు. 20 మీటర్లు తవ్వగానే టన్నెల్‌లోకి నీరు, మట్టి లీక్‌ అయ్యి టన్నెల్లో ఒకవైపు నుంచి నీరు లీక్ అయ్యి మట్టి కుంగిందని ఉత్తమ్ కుమార్ వివరించారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post