శాయంపేటలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జీఎస్సార్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయండి..కార్యకర్తల
- పాత, కొత్త నాయకత్వం అని తేడా లేకుండా పని చేయాలి..
- పదవులు కోరుకుంటే రావు, ప్రజల మన్ననలు పొందితేనే అన్ని అవకాశాలు..
- శాయంపేటలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య  సమావేశంలో ఎమ్మెల్యే జీఎస్సార్..
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని, కష్టపడ్డ ప్రతీ ఒక్కరికీ అవకాశాలు వస్తాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావుఅన్నారు. ఈరోజు శనివారం శాయంపేట మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుచ్చిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన అన్ని గ్రామాల కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.... పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారాస ప్రభుత్వం నిరుద్యోగులను తీవ్రంగా వంచించిందని ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారాస, భాజాపా కలిసిపోయి లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నాయని అన్నారు. యువత నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్శిటీని నెలకొల్పినట్లు తెలిపారు. పేద, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ను ప్రారంభించినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు అన్ని గ్రామాలలో పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించాలని, అందుకొరకు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. కష్టపడే ప్రతి ఒక్కరికి అవకాశాలు వస్తాయని, పదవులు కోరుకుంటే రావని, ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను గడపగడపకు తీసుకెళ్లే బాధ్యత గ్రామ నాయకులదేనన్నారు. వీలైనన్ని ఎక్కువ గ్రామాలు ఏకగ్రీవం అయ్యేలా చూడాలని పిలుపునిచ్చారు. పాత, కొత్త నాయకత్వం అని తేడా లేకుండా పనిచేయాలన్నారు. గ్రామాలలో వర్గాలుగా విడిపోయి పార్టీకి నష్టం చేసేలా చూస్తే ఊరుకునేది లేదన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post