టీచర్స్ ఎమ్మెల్సీలో బిజెపి అభ్యర్థి సరోత్తం రెడ్డి నిగెలిపించాలని ప్రచారం

శాయంపేటమండలంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షుడు నరహరిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జన్నే మొగిలి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 27-02 2025 గురువారం రోజున వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎన్నికలు ఉన్నాయన్న విషయం తెలిసినదే ఉపాధ్యాయ మిత్రులకు విన్నవించుకునే విషయం ఏమనగా ఉపాధ్యాయులే తెలంగాణ మార్గదర్శకులు ఉపాధ్యాయులు ఉన్నత విద్యావంతులు సమాజంపై ప్రభావం చూపే ప్రభావశీలురు. ప్రజాస్వామిక విలువలు పరిరక్షకులు. ధర్మబద్ధమైన సమ్మిళిత సమాజానికి మార్గదర్శకులు. త్వరలో జరగనున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ ఆలోచన తెలంగాణ గమనాన్ని నిర్దేశిస్తుంది. ఉపాధ్యాయుల సమస్యలపై సమగ్ర అవగాహన పరిష్కారం పై చిత్తశుద్ధి ఉన్న నాయకుడు మన భూపాల్ పల్లి నియోజకవర్గానికి చెందిన వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ శాసనమండలి నియోజకవర్గ ఎమ్మెల్సీగా TPUS మద్దతుతో పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థిపులి సరొత్తం రెడ్డి శాసనమండలిలో ఉపాధ్యాయుల గొంతు కవుతారు. నిత్యం టీచర్ల గళం వినిపించే బిజెపి అభ్యర్థిగా పోటీలో ఉన్నారు ఉపాధ్యాయుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చేందుకు విజ్ఞతతో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్న గతంలో జరిగిన మహబూబ్నగర్ - రంగారెడ్డి- హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీలు బిజెపి అభ్యర్థి ఏవీఎన్ రెడ్డి, గెలవడం జరిగింది ఆయనకు తోడుగా ఉపాధ్యాయుల సమస్యలపై తన గలాన్ని వినిపించడానికి ఫిబ్రవరి 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీ అమూల్యమైన మీ మొదటి ప్రాధాన్యత ఓటుతో బిజెపి అభ్యర్థి పులి సరోత్తంరెడ్డికి వేసి గెలిపించలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయరాకుల మొగిలి, జిల్లా కౌన్సిల్ కానుగుల నాగరాజు, ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు ఉప్పు రాజు, యువ మోర్చా జిల్లా కార్యదర్శి లడే శివ, మండల సోషల్ మీడియా కన్వీనర్ ఎర్ర రాకేష్ రెడ్డి భూత్ అధ్యక్షులు కోమటి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post