మాజీ ఎమ్మెల్యేపై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నాం

మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ దుదిపాల తిరుపతిరెడ్డి
భూపాలపల్లి లో నిన్న జరిగిన రాజలింగమూర్తి హత్య విషయంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పై చేసిన వ్యాఖ్యలు మండల పిఎసిఎస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతిరెడ్డి తీవ్రంగా ఖండించారు. నిన్న జరిగిన రాజలింగమూర్తి హత్య విషయంలో రాజకీయం చేయడం మంచిది కాదని హత్యకు భూవివాదాలు కారణమని స్థానిక ప్రజలు పోలీసులు చెప్తన్నప్పటికీ కావాలని కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు,మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పై అనవసర ఆరోపణ లు చేయడం మానేయాలని విమర్శించారు మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమ ణారెడ్డి పై ఇంకోసారి నిరాధార ఆరోపణ లు చేస్తే సహించేది లేదని అన్నారు ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీపై అసత్య ఆరోపణలు చేయడం మానుకొని ప్రభుత్వ ప్రజా సంక్షేమ కోసం పని చేయాలన్నారు ఇంకొక్కసారి అనవసరమైన ఆరోప ణలు చేస్తే సహించేది లేదన్నారు ఎవరి చరిత్ర ఏమిటో ప్రజలకు తెలుసని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నది మీరే కదా దమ్ముంటే సిట్టింగ్ జడ్జితో న్యాయని చారణ చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు మీ అసమర్థ పాలననుకప్పి పుచ్చుకోవ డానికి మాజీ ఎమ్మెల్యే పై అసత్య ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మా మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి మచ్చలేని మహా నాయ కుడు అని ప్రజలకు తెలుసు ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు చల్లా శ్రీనివాసరెడ్డి మాజీ సర్పంచ్ మస్కే సదయ్య నాయకులు మోతే సమ్మయ్య మోహన్ రెడ్డి రాజిరెడ్డి పాల్గొన్నారు.

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post