ఘరానా దంపతుల ఆటకట్టు

సులువుగా డబ్బు సంపాదించేందుకు పథకం..
గంజాయి రవాణాను ఎంచుకున్న భార్యభర్తలు
ఒడిషా నుంచి సూరత్కు రైలులో చేరవేత
వరంగల్ పోలీసులకు పట్టుబడిన నిందితుల
వరంగల్: గంజాయి రవాణాకు పాల్ప డుతున్న ఒడిషాకు చెందిన కిలాడీ దంపతులను మిల్స్ కాలనీ, డ్రగ్స్ కంట్రోల్ టీం, రైల్వే ప్రోటేక్షన్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. ఘరానా దంపతుల నుండి సుమారు రూ. 6 లక్షల విలువ గల 24 కిలోల గంజాయి ప్యాకేట్లతో పాటు రెండు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.అరెస్టుకు సంబంధించి మిల్స్ కాలనీ ఇన్స్ స్పెక్టర్  వెంకటరత్నం వివరాలను వెల్లడించారు. ఒడిషాకు చెందిన గోగి శంకర్ దాస్, పూర్ణిమ భార్యభర్తలు. ప్రస్తుతం సూరత్లో నివాసం వుంటున్నారు. సులభంగా డబ్బు సంపాదించాలనుకొని గంజాయి రవాణాను ఎంచుకున్నారు. ఇందుకోసం ఈ దంపతలు గంజాయిని ఒడిషా నుండి తీసుకవచ్చి సూరత్లో విక్రయించేవారు. గతంలో ఒడిషాలో పరిచయం వున్న స్మగ్లర్ల వద్ద గంజాయి కోనుగోలు చేసి రహస్యంగా బ్యాగుల్లో భద్రపర్చి రైలు ద్వారా ముంబై మీదుగా సూరత్కు తరలించే వారు. ఇదే తరహలో కిలాడీ దంపతులు పలుమార్లు గంజాయిని సూరత్కు తరలిం చారు. ఈరోజు కోనార్క్ ఎక్స్ ప్రెస్  రైలులో ప్రయాణిస్తూపోలీసులకు పట్టుబడుతామనే భయంతో నిందితులు వరంగల్ రైల్వే స్టేషన్లో దిగి మరో మార్గంలో ముంబై వేళ్ళేందుకు రెడీ అయ్యారు. మూడో ప్లాట్ఫాం నుండి బయటికి పోయేందుకు ప్రయత్ని స్తుండగా అదే సమయంలో డ్రగ్స్ కంట్రోల్ టీంతో కల్పి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న మిల్సా కాలనీ ఎస్సె సురేష్ నిందితులను అనుమానంతో అదుపులోకి తీసుకున్నారు. తనిఖీ చేయగా వారి బ్యాగుల్లో గంజాయిని బయటపడింది. దీంతో దంపతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు

0 Comments

Post a Comment

Post a Comment (0)

Previous Post Next Post